Surat: పెళ్లి చేసుకొమ్మంటూ ఇబ్బంది పెడుతోందని ప్రియురాలిని ఒడిశా నుంచి గుజరాత్కు తీసుకెళ్లి, 49సార్లు…
సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు, విషయమేంటని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు నుంచి వారికి ప్రధాన ఆధారం లభించింది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆరా తీశారు. అనంతరం నిందితులను భువనేశ్వర్ వెళ్లి అరెస్టు చేశారు. ఈ నేరంలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోందని సూరత్ పోలీసులు తెలిపారు.
Surat: చేసుకొమ్మంటూ ప్రియురాలు ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన అతడు, ఆమెను గుజరాత్ తీసుకెళ్లి అక్కడ కత్తితో 49 సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆమె చనిపోయిందని గుర్తించేంత వరకు పొడుస్తూనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి పేరు జగన్నాథ్ గోడ. మృతురాలి పేరు కునిదర్ సీమాదాస్. ఆమెను గుజరాత్లోని సూరత్కు రప్పించి అక్కడే హతమార్చాడు.
West Bengal: డ్రగ్స్ కొనడానికి రూ.10 అడిగిన యువకుడు.. బండరాయితో కొట్టి చంపిన స్నేహితుడు
సూరత్ నగరాన్ని తిరిగి చూద్దామంటూ మాయ మాటలు చెప్పి మోసపూరితంగా కునిదాస్ను నేరస్థలానికి తీసుకెళ్లాడు. అనుకున్న స్థలానికి చేరుకున్నాక బాధితురాలిని చనిపోయే వరకు 49 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం ఎడారిలో ఆమె మృతదేహాన్ని పడేసి, భువనేశ్వర్కు తిరిగి వచ్చాడు. మృతదేహాంపై సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు, విషయమేంటని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు నుంచి వారికి ప్రధాన ఆధారం లభించింది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆరా తీశారు.
Nirav Modi: బ్రిటన్లో చివరి అవకాశం కోల్పోయిన నీరవ్ మోదీ.. ఇక చచ్చినట్లు ఇండియాకు రావాల్సిందే
చివరికి, నిందితుడిని గుర్తించారు సూరత్ పోలీసులు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్యానేరం) కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను భువనేశ్వర్ వెళ్లి అరెస్టు చేశారు. ఈ నేరంలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోందని సూరత్ పోలీసులు తెలిపారు.