Vikarabad : వీడిన వికారాబాద్ ఫ్యామిలీ మిస్సింగ్ మిస్టరీ

రెండు రోజుల క్రితం తాండూరు నుంచి వెళ్లిపోయిన వికారాబాద్ జిల్లా బీఎస్పీ నాయకుడు దౌరిశెట్టి సత్యమూర్తి.... అతని ఇద్దరు పిల్లల  ఆచూకీ లభ్యమయ్యింది.

Vikarabad : వీడిన వికారాబాద్ ఫ్యామిలీ మిస్సింగ్ మిస్టరీ

Vikarabad Bsp Leader

Vikarabad :  మూడు నెలలుగా కనిపించకుండా పోయిన తన భార్య ఆచూకి రెండు రోజుల్లో  కనిపెట్టకపోతే తమ శావాల లొకేషన్ షేర్ చేస్తానని సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి… రెండు రోజుల క్రితం తాండూరు నుంచి వెళ్లిపోయిన వికారాబాద్ జిల్లా బీఎస్పీ నాయకుడు దౌరిశెట్టి సత్యమూర్తి…. అతని ఇద్దరు పిల్లల ఆచూకీ లభ్యమయ్యింది.

సోషల్ మీడియాలో సత్యమూర్తి   వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న  పోలీసులు గాలింపు చేపట్టారు.  అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.  సీసీటీవీ ఫుటేజీ ల ఆధారంగా కూడా విచారణ చేశారు.  వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి బయలు దేరిన సత్యమూర్తి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి  విమానంలో వారణాశి వెళ్లినట్లు గుర్తించారు.

వెంటనే అక్కడకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపారు.  వారణాశిలో జరిపిన గాలింపులో   ఒక హోటల్ లో వారి జాడ కనుగొన్నారు. సత్యమూర్తి వారి ఇద్దరు పిల్లలను తాండూరు తీసుకు  వస్తున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

Also Read : lady Singham : డ్రగ్స్ కేసులో రాజస్ధాన్ లేడీ సింగం అరెస్ట్