Hyderabad : పందెంలో డబ్బు పోగొట్టుకున్నాడు.. తర్వాత భార్య అదృశ్యమయ్యింది?

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు‌స్టేషన్ పరిధిలో తన భార్య కనిపించటం లేదని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన రాజేంద్ర క

Hyderabad : పందెంలో డబ్బు పోగొట్టుకున్నాడు.. తర్వాత భార్య అదృశ్యమయ్యింది?

woman missing

Hyderabad : హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు‌స్టేషన్ పరిధిలో తన భార్య కనిపించటం లేదని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన రాజేంద్ర కుమార్ అనేవ్యక్తి భార్యతో కలిసి బతుకు తెరువు కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చాడు.

భార్యా భర్తలిద్దరూ మియాపూర్ లో నిర్మాణ కూలీలుగా పని చేసేవారు. ఈనెల 16వ తేదీన మియాపూర్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో రాజేంద్రకుమార్ పందెం కాసి డబ్బులు పోగొట్టుకున్నాడు.
Also Read :Dombivli Murder Case : వీడిన సుప్రియ ఆంటీ మర్డర్ మిస్టరీ
అనంతరం ఆటో ఎక్కి పంజాగుట్ట సర్కిల్ లో దిగి బేగంపేట రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్లసాగారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి భార్య కనిపించకుండా పోవటంతో శనివారం పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.