Youtuber : రోడ్డు ప్రమాదంలో నటి మృతి-కొబ్బరి బోండాలలో ఆల్కహాలే కారణం ?
ప్రముఖ యూ ట్యూబర్, నటి గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి గచ్చిబౌలీ టిమ్స్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది.
Youtuber : ప్రముఖ యూ ట్యూబర్, నటి గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి గచ్చిబౌలీ టిమ్స్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్పాత్పై పల్టీలు కొట్టింది.
దీంతో కారులో ఉన్న గాయత్రి, ఆ దగ్గర్లోనే ఎల్లా హోటల్ వద్ద గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి అనే మహిళని కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారులో గాయత్రితోపాటు ఉన్న రోహిత్కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు చేసిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.
శుక్రవారం (మార్చి 18) హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసం పబ్కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పబ్లో యువకులు కొబ్బరి బొండాల్లో ఆల్కహాల్ కలుపుకుని తాగినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హోలీ పండుగకు ముందు రోజే యువకులు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
Also Read : Jubilee Hills : జూబ్లీహిల్స్ కారు ఆక్సిడెంట్.. డ్రైవింగ్ చేసింది అతనే
మద్యం కలుపుకున్న కొబ్బరి బొండాలతోనే యువకులు పబ్కు వెళ్లినట్లిగా గుర్తించారు. హోలీ పండగ సందర్భంగా మద్యం అనుమతి లేనందున కొబ్బరి బొండాల్లో మద్యం నింపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.