AP ECET 2021 : ఏపీ ఈసెట్ 2021, సూచనలు..నిబంధనలు ఇవే

ఏపీ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (ap-ecet)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఈ పరీక్ష జరుగుతోంది.

AP ECET 2021 : ఏపీ ఈసెట్ 2021, సూచనలు..నిబంధనలు ఇవే

Ap Ecet 2021

AP ECET 2021 Exam : ఏపీ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (ap-ecet)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఈ పరీక్ష జరుగుతోంది. హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా..48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఈసెట్ ప్రొఫెసర్ జింకా రంగ జనార్ధన, కన్వీనర్ ప్రొ.సి.శశిధర్ తెలిపారు. అర్హత సాధించిన వారు బీటెక్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశిస్తారు. 13 బ్రాంచీల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు మొత్తం 34 వేల 271 మంది దరఖాస్తు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏడు బ్రాంచ్ లకు సంబంధించి విద్యార్థులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్రాంచ్ ల విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెన్‌టేషన్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి 140, మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు 10,652, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌కు 7,760, మైనింగ్‌ ఇంజినీరింగ్‌కు 292, ఫార్మసీకి 140, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు 420, సిరామిక్‌ టెక్నాలజీకి 6, బీఎస్సీ (మేథమేటిక్స్‌)కు 58, మెటలర్జికల్‌కు 147, ఈసీఈకి 6,330, కెమికల్‌ ఇంజినీరింగ్‌కు 371, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌కు 2,249, సివిల్‌ ఇంజినీరింగ్‌కు 5,606 దరఖాస్తులు అందాయి.

విద్యార్థులకు సూచనలు, నిబంధనలు

పరీక్షా సమయం ముగిసే వరకు విద్యార్థులను కేంద్రం నుంచి బయటకు పంపరు.
ఉదయం సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1.30 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.
బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. దీంతో చేతులకు గోరింటాకు, మెహందీ, టాటూ మార్కులు ఉండకూడదు.
ఈ పరీక్షకు కూడా ఒక్క నిమిషం నిబంధన ఉంది.
క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, మొబైల్ ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.