టీచింగ్ ఆస్పత్రుల్లో క్లినకల్ ట్రయల్స్ సహజం : నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ
హైదరాబాద్ నీలోపర్ ఆస్పత్రిల్లో చిన్నపిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మురళీకృష్ణ స్పందించారు. భోధనా ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ సర్వసాధారణమని ఆయన చెప్పారు.
ఎథికల్ కమిటీ అనుమతితోనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నీలో ఫర్ ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి. ప్రతి టీచింగ్ ఆస్పత్రిలోనూ స్డడీ అనేది జరుగుతుంటుంది. టీచింగ్ తో పాటు రీసెర్చ్ కూడా చేస్తారు. ప్రతి మెడికల్ కాలేజీలో రీసెర్చ్ జరుగుతుంది. రీసెర్చ్ లో భాగంగానే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని మురళీకృష్ణ చెప్పారు.
గాంధీ, నిమ్స్. ఉస్మానియా వంటి టీచింగ్ ఆస్పత్రుల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని, ఇవన్నీ నిబంధనలకు లోబడే జరుగుతాయని ఆయన వివరణ ఇచ్చారు.