Hyderabad CP Anjanikumar : సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు
Hyderabad CP Anjanikumar : హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే22 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే సరుకు రవాణా వాహనాలను నగరంలో తిరగటానికి అనుమతిస్తామని చెప్పారు.
లోడింగ్, అన్లోడింగ్ కూడా నిర్దేశించిన వేళల్లోనే అనుమతి ఇస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరుకు రవాణా వాహనాలు రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.