ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆశాఖ కార్యాలయంలో శ్రీ శార్వరి నామసంవత్సర ఉగాదివేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లిసంతోష్ కుమా్ర శర్మ ఉగాది పంచాంగాన్ని పఠించారు. ఈ సంవత్సరం రాష్ర్టానికి అంతా మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.వి.రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.