మూడేళ్ల బాలుడి ప్రార్థనకు నెటిజన్ల ఫిదా
మూడేళ్ల బాలుడి చేస్తున్న ప్రార్థనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్..ఎంత క్రమశిక్షణగా పాడాడు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సెయింట్ లూయిస్లోని రనీషా మార్టిన్..ట్రాన్స్ఫర్ మేషన్ క్రిస్టియన్ స్కూల్..సెయింట్ లూయిస్లో జరిగింది. ఈ వీడియోను ఆ బుడ్డోడి తల్లి షేర్ చేసింది.
భోజన సమయంలో చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే.
Read More : CRDA కార్యాలయానికి రైతుల క్యూ
2020, జనవరి 07వ తేదీన స్కూల్లో లంచ్ టైమ్ సందర్భంగా టీచర్ జేమ్స్ విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్నారు. భోజనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ..మూడు సంవత్సరాలున్న మఖి మార్టిన్తో ప్రార్థన చేయిస్తోంది. ఈ సందర్భంగా తలవంచుకుని, దండం పెడుతూ టీచర్ చెబుతున్న ప్రార్థనను స్పష్టంగా చదువుతున్నాడు మఖి. అక్కడనే ఉన్న తల్లి రనీషా మార్టిన్ వీడియో తీసి ఫేస్ బుక్లో పోస్టు చేసింది. తాను ఆశ్చర్యపోయానని, అంత స్పష్టంగా చదువుతాడని అనుకోలేదని తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్వీట్ యాంగిల్ బాయ్..మే గాడ్ బ్లెస్ హిమ్ ఆల్ వేస్ అని వెల్లడించారు.