Taliban : పంజ్‌షీర్‌‌ ఆక్రమణకు తాలిబన్లతో చేతులు కలిపిన అల్‌ఖైదా

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి..

Taliban : పంజ్‌షీర్‌‌ ఆక్రమణకు తాలిబన్లతో చేతులు కలిపిన అల్‌ఖైదా

Taliban

Updated On : September 5, 2021 / 8:39 PM IST

Taliban : ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసి ఆక్రమించుకునేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు అల్ ఖైదా మిలిటెంట్ యూనిట్లు తాలిబన్లతో కలుస్తున్నారని అఫ్ఘానిస్తాన్ నేషనల్ రెసిస్ టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి తెలిపారు.

Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

శాంతిపూర్వక పరిష్కారానికి ఫ్రంట్ కట్టుబడి ఉంది. అదే సమయంలో తాలిబన్ల నుంచి ఎలాంటి దాడి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని రెసిస్ టెన్స్ అధికార ప్రతినిధి ఫహీమ్ దస్తీ తెలిపారు. రెసిస్ టెన్స్ దళాలు 350మంది తాలిబన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. పంజ్ షీర్ ప్రావిన్స్ లోని షుతుల్ జిల్లాను ఆక్రమించుకున్నట్టు తాలిబన్లు చేసిన ప్రకటనను రెసిస్ టెన్స్ దళాలు ఖండించాయి.

తాలిబన్లు, పంజ్ షీర్ రెసిస్ టెన్స్ ఫ్రంట్ మధ్య ఘర్షణలపై అఫ్ఘాన్ మాజీ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్ స్పందించారు. ఇరు దళాలు ఘర్షణలు మాని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!

అఫ్ఘానిస్తాన్ లో అస్థిరత పాకిస్తాన్ ను కలవరపెడుతోంది. బోర్డర్ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అఫ్ఘాన్ బోర్డర్ లోని పాకిస్తాన్ సెక్యూరిటీ పోస్టులపై గత కొన్ని రోజులుగా దాడులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకుండా పాకిస్తాన్ లో అడుగుపెడుతున్న అప్ఘాన్ శరణార్దులను పెషావర్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

అఫ్ఘానిస్తాన్ లో రాజధాని కాబూల్ సహా అన్నింటినీ స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. ఆక్రమించేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను పంజ్ షీర్ యోధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇటీవల పంజ్ షీర్ ప్రావిన్స్ లోని ఖవక్ లో జరిగిన హోరాహోరీలో 350 మంది తాలిబన్లు హతమైనట్టు పంజ్ షీర్ పోరాట దళంలోని నార్తర్న్ అలయన్స్ ప్రకటించింది. మరో 40 మందిని బందీలుగా పట్టుకున్నామని వెల్లడించింది.

పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు తాలిబన్లు అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. అయితే, పంజ్ షీర్ పోరాట దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. గుల్బహర్ లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటెయినర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

ఇటు కశ్మీర్ పైనా తాలిబన్లను అల్ ఖైదా ఉసిగొల్పుతోంది. ప్రపంచంలోని ముస్లింలు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఆయా దేశాల నుంచి స్వేచ్ఛ కల్పించాలంటూ రెచ్చగొడుతోంది. ‘‘ఓ అల్లా.. సోమాలియా, యెమన్, కశ్మీర్ .. ఇతర ముస్లిం ప్రాంతాలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అనే సందేశాన్ని తాలిబన్లకు అల్ ఖైదా పంపించింది.