Nobel Prize In Chemistry : రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్
2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.
Nobel Prize In Chemistry 2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్,యూకేకి చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్మిలన్ లను కెమిస్ట్రీలో విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం ప్రకటించింది.
అణు నిర్మాణానికి ఉపయోగపడే అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ అభివృద్ధికి దోహదం చేసినందుకు వీరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇన్నేళ్లుగా లోహాలు, ఎంజైమ్లు అనే రెండు రకాల ఉత్ప్రేరకాలు మాత్రమే ఉన్నాయని సైంటిస్టులు విశ్వసించారు. కానీ ఈ నోబెల్ పురస్కార గ్రహీతలు మూడో రకం కూడా ఉంటుందని..అసిమెట్రిక్ ఆర్గానోకెటాలిసిస్ను అభివృద్ధి చేసి రుజువు చేశారు. ఈ పరిశోధన పరమాణు నిర్మాణంలో కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇది అసమాన అణువులను ఉత్పత్తి చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
కాగా, నోబెల్ అవార్డ్ కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు నగదు పురస్కారం అందజేస్తారు. ఆ మొత్తాన్ని ఈ ఇద్దరికి పంచుతారు. అయితే,మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో అందించే నోబెల్ పురస్కారాల్లో ఇది మూడవది.
సొమవారం మెడిసిన్ లో నోబెల్ బహుమతిని ప్రకటించగా.. అమెరికా సైంటిస్టులు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్లు ఈ బహుమతి దక్కింది. ఇక,2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో…జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు సుకురో మనాబో(90), క్లాస్ హాసిల్మన్(89), జార్జియో పారిసీ(73)ని ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ సొంత కాన్వాయ్ లోనే లఖిమ్పూర్ కి బయల్దేరిన రాహుల్ గాంధీ