Elon Musk: ట్విట్టర్ దివాలాపై ఎలాన్ మస్క్ ఆందోళన.. ఉద్యోగులకు గట్టి వార్నింగ్
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యూలేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల వల్ల ట్విట్టర్ మరింత దిగజారుతోందని, మస్క్ వైఖరి వల్ల ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు సైతం రాజీనామాలు చేస్తున్నట్లు అనేక విమర్శలు వస్తున్నాయి.
Elon Musk: ఆదాయం సరిగా రాబట్టకపోతే ట్విట్టర్ దివాళా తీయొచ్చనే ఆందోళన ఎలాన్ మస్క్కు పెరిగింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు ఆయన తాజాగా తెలియజేశారు. ఈ విషయం చెప్తూనే ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు పలు ఆదేశాలు జారీ చేశారు. వారంలో తప్పనిసరిగా 80 గంటలు పని చేయాలని, ఉద్యోగులకు ఆఫీసులో భోజనం ఉండదని, అలాగే ఇంటి నుంచి పని చేసే సౌకర్యం కూడా ఉండదని తేల్చి చెప్పారు. పెద్ద హైడ్రామా అనంతరం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ సొంతం చేసుకున్నారు. కాగా, అప్పటికే ట్విట్టర్ 10 శాతం నష్టాలతో కొనసాగుతోంది. దీంతో తనదైన శైలిలో తిరిగి లాభాల్లో పెట్టేందుకు మస్క్ తన ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్విట్టర్ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే పనుల్లో మార్పులతో పాటు, వారికి కల్పించే సౌకర్యాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ పతనం అంచుకు వెళ్లడాన్ని తాను తోసి పుచ్చలేనని, అయితే శ్రమించి పని చేస్తే దాన్ని తిరిగి గాడిలో పెట్టొచ్చని మస్క్ అంటున్నారు.
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యూలేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల వల్ల ట్విట్టర్ మరింత దిగజారుతోందని, మస్క్ వైఖరి వల్ల ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు సైతం రాజీనామాలు చేస్తున్నట్లు అనేక విమర్శలు వస్తున్నాయి.