Afghanistan : ప్ర‌జ‌లు పారిపోతుంటే… పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబ‌న్లు

అఫ్గానిస్తాన్ పౌరులు భయాందోళనలతో కాలం వెల్లడిస్తుంటే.. తాలిబన్లు మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.

Afghanistan : ప్ర‌జ‌లు పారిపోతుంటే… పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబ‌న్లు

Afghanistan (2)

Afghanistan :  ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. పరిపాలన అధ్యక్షుడి నుంచి తాలిబన్ల చేతులోకి వెళ్లడంతో భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావడం లేదు.

అక్కడ మహిళలు రోడ్లపై కనిపించక నాలుగు రోజులు అవుతుందని.. స్థానికంగా హక్కులకోసం పనిచేసే ఓ మహిళ సోమవారం మీడియాకు తెలిపారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు తాలిబన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎవరు పనులు వారు చేసుకోవచ్చని తెలిపింది.

ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వణికిపోతుంటే.. తాలిబన్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పార్కులలో ఆటవస్తువులతో ఆడుతున్నారు. కార్లలో ఎక్కి చక్కర్లు కొడుతున్నారు. జిమ్ లలో కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం పార్క్ ట్రాయ్ కార్లు నడుపుతూ కేకలు వేశారు. దీంతోపాటు జిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నాయి. తాలిబన్లు చిన్నపిల్లలా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. కాబుల్ లో కొంతమంది నగరంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు వెళ్లి అక్కడ ట్రాయ్ కార్లలో తిరుగుతూ, చెక్క గుర్రాలపై రౌండ్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ప్రెసిడెంట్ భవనంలో చిందులు వేస్తున్నారు.