karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. న్యూ మిలీనియం పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అఖిల అనే బాలిక హాస్టల్లో ఉంటోంది. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఆమె అస్వస్థతకు గురైంది.
karimnagar: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. న్యూ మిలీనియం పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అఖిల అనే బాలిక హాస్టల్లో ఉంటోంది. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను హాస్టల్ సిబ్బంది హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఇప్పటికీ ఆమె మృతదేహం అక్కడే ఉంది. దీంతో మిలీనియం పాఠశాల ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతి చెంది రెండు రోజులు గడుస్తున్నా పాఠశాల యాజమాన్యం స్పందించలేదు. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.