Hamsa Nandini : 25 రోజులపాటు నరకం చూశాం – హంసా నందిని..

డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని..

Hamsa Nandini : 25 రోజులపాటు నరకం చూశాం – హంసా నందిని..

Actress Hamsa Nandini About Her Covid Experience

Hamsa Nandini: కరోనా సెకండ్ వేవ్‌లో వేగంగా వ్యాపిస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు కోవిడ్‌తో పోరాడి కోలుకున్నారు.

సెలబ్రిటీలు కూడా కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్‌గా నటి హంసా నందిని కోవిడ్‌ బారిన పడి, కోలుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హంసా ఈ మధ్య పోస్టులు చెయ్యడం లేదు. దీంతో ఆమెకు కరోనా సోకిందనుకున్నారంతా..

నిజంగానే తాను, తన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డామని, దాదాపు 25 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకున్నామని.. ఆ టైంలో నరకం చూశామని, అసలు బతుకుతామనే ఆశ కూడా కోల్పోయామని, దేవుడి దయ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రేయర్స్ అండ్ డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని.