Hamsa Nandini : 25 రోజులపాటు నరకం చూశాం – హంసా నందిని..
డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని..
Hamsa Nandini: కరోనా సెకండ్ వేవ్లో వేగంగా వ్యాపిస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు కోవిడ్తో పోరాడి కోలుకున్నారు.
సెలబ్రిటీలు కూడా కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా నటి హంసా నందిని కోవిడ్ బారిన పడి, కోలుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హంసా ఈ మధ్య పోస్టులు చెయ్యడం లేదు. దీంతో ఆమెకు కరోనా సోకిందనుకున్నారంతా..
After 25days of hospitalization, I am pleased to inform you my family is back home and recovering ?.
This virus is way too real. Stay at home and take good care of your loved ones.
.#swanstories #stayhomestaysafe— Hamsa Nandini (@ihamsanandini) May 21, 2021
నిజంగానే తాను, తన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డామని, దాదాపు 25 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నామని.. ఆ టైంలో నరకం చూశామని, అసలు బతుకుతామనే ఆశ కూడా కోల్పోయామని, దేవుడి దయ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రేయర్స్ అండ్ డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని.
View this post on Instagram