Allu Arjun: సుకుమార్‌ను కమిట్‌మెంట్ అడిగిన బన్నీ.. ఎందుకో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

Allu Arjun: సుకుమార్‌ను కమిట్‌మెంట్ అడిగిన బన్నీ.. ఎందుకో తెలుసా?

Allu Arjun Asks Sukumar To Give Commitment

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Allu Arjun: త్వరలో బన్నీతో భేటీ కానున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎందుకో?

ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ను అఫీషియల్‌గా స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినా, ఇంకా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని పుష్పరాజ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు చాలా ఆలస్యం అవుతుండటంతోనే బన్నీ ఫ్యాన్స్ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే NTR30, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోయే SSMB28, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోయే RC15 ప్రాజెక్టులన్నీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతున్నాయి.

Allu Arjun : అత్తారింటికి అల్లుఅర్జున్.. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం..

దీంతో బన్నీ తన నెక్ట్స్ మూవీ పుష్ప-2 విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండాలని చూస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్టు పనులు కూడా ఫైనల్ కావడంతో ఈ సినిమా షూటింగ్‌ను సుకుమార్ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడా అని బన్నీ ఆలోచిస్తున్నాడట. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో బన్నీ తాజాగా సుకుమార్‌ను ఓ కమిట్‌మెంట్ అడిగాడట. ఈ సినిమా షూటింగ్‌ను సుక్కు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చని.. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 2023 నాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. దీనికి సుకుమార్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.