Bhagyasri : తల్లి ప్రభాస్ సినిమాలో.. కూతురు బెల్లంకొండ సినిమాలో

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్‌’లో నటిస్తుంది. తాజాగా ఆమె కూతురు అవంతిక తెరంగ్రేటం

Bhagyasri : తల్లి ప్రభాస్ సినిమాలో.. కూతురు బెల్లంకొండ సినిమాలో

Bhagyasri

Bhagyasri :  సినిమాల్లో వారసులు అంటే ఎక్కువగా హీరోలు వచ్చేవాళ్ళు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్స్ కూడా వస్తున్నారు, వచ్చి సక్సెస్ అవుతున్నారు. 80, 90 దశకాల్లో హీరోయిన్స్ గా నటించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ కూతుళ్లు హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. అన్ని పరిశ్రమలలోను ఇది జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది మాజీ హీరోయిన్స్ వాళ్ళ కూతుర్లని హీరోయిన్స్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ మాజీ హీరోయిన్ కూడా తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయబోతుంది.

Puneeth Rajkumar : పునీత్ కోసం అభిమాని ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన పునీత్ సోదరుడు

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా భాగ్యశ్రీ బిజీగానే ఉంది. ప్రస్తుతం భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌కి తల్లిగా నటిస్తుంది. తాజాగా ఆమె కూతురు అవంతిక తెరంగ్రేటం చేయబోతున్నట్టు సమాచారం. అదికూడా తెలుగు సినిమాతో. ఇప్పటికే భాగ్యశ్రీ తనయుడు, అవంతిక సోదరుడు అభిమన్యు బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో అవంతిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.

Mallika Sherawat : నడుము మీద చపాతీ వేడి చేస్తామన్నారు.. అందుకే రిజెక్ట్ చేశా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్‌ హీరోగా రాబోతున్నాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మరో సినిమా కూడా ఓకే చేసినట్టు సమాచారం. బెల్లంకొండ గణేష్ సరసన అవంతికని హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామని అడుగగా భాగ్యశ్రీ ఓకే చెప్పారని సమాచారం. దీంతో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక తెలుగు సినిమాతో తెరంగ్రేటం చేయబోతుంది. ఇక భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ కి తల్లిగా నటిస్తుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ తెలుగు సినిమాలతో బాగానే ప్లాన్ చేస్తున్నారు.