Mega Brothers : మేనల్లుడి కోసం మెగా బ్రదర్స్..
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు..
Mega Brothers: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు. సాయి తేజ్ – దేవ కట్టా కాంబోలో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..
ఇదిలా ఉంటే మేనల్లుడి కోసం మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అండగా నిలబడబోతున్నారు. చిరంజీవి వేసిన బాటలో మెగా – అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా కష్టపడి తమకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వారు నిలదొక్కుకునే వరకు చిరు కూడా సపోర్ట్గా నిలిచారు. ఇప్పుడు మేనల్లుడి సినిమా ‘రిపబ్లిక్’ ట్రైలర్ చిరు విడుదల చేశారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
తర్వాత పవన్ కూడా తనకిష్టమైన మేనల్లుడి కోసం రంగంలోకి దిగబోతున్నారు. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్కి కూడా పవన్ కళ్యాణ్ గెస్ట్గా వచ్చారు. అక్టోబర్ 1న ‘రిపబ్లిక్’ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది.
Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..