Abhishekam : దాసరి నారాయణరావు నిర్మాణం.. 4000 ఎపిసోడ్లతో పూర్తవుతున్న ‘అభిషేకం’

తెలుగు టెలివిజన్‌ సీరియల్ చరిత్రలో నిరాటంకంగా ప్రసారమవుతూ సరిగ్గా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది 'అభిషేకం' సీరియల్. 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది.....

Abhishekam : దాసరి నారాయణరావు నిర్మాణం.. 4000 ఎపిసోడ్లతో పూర్తవుతున్న ‘అభిషేకం’

Abhishekam

Dasari Narayana Rao :  దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నో సినిమాలను డైరెక్షన్ చేయడమే కాక ఎన్నో సినిమాలని నిర్మించారు. అలాగే బుల్లితెరపై ఆయన భార్య దాసరి పద్మ నిర్మాతగా సీరియల్స్ ని కూడా నిర్మించారు. దాసరి నారాయణరావు నిర్మాణంలో దాసరి పద్మ నిర్మాతగా ‘సౌభాగ్య మీడియా’ పతాకంపై ‘అభిషేకం’ అనే సీరియల్ ని 14 సంవత్సరాల క్రితం 2008 డిసెంబరు 22న ప్రారంభమైంది.

Pooj Hegde : అమితాబ్‌తో కలిసి మజా యాడ్‌లో పూజాహెగ్డే..

తెలుగు టెలివిజన్‌ సీరియల్ చరిత్రలో నిరాటంకంగా ప్రసారమవుతూ సరిగ్గా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ‘అభిషేకం’ సీరియల్. 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది ‘అభిషేకం’ సీరియల్. ఈ సీరియల్ కి దాసరి నారాయణరావు కథ అందించారు. ‘అభిషేకం’ సీరియల్ ఎన్నో అవార్డులు – రివార్డులు కూడా సాధించింది. గతంలో ఈ సీరియల్ లో శ్రీహరి, జయసుధ, మురళీమోహన్‌ లాంటి చాలా మంది సినిమా స్టార్లు కూడా నటించారు. ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం అభిషేకం సీరియల్‌ చివరి ఎపిసోడ్‌ టెలికాస్ట్ కానుంది.