Bigg Boss 5: హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కి అన్యాయం.. రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ షో ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 12 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు మాత్రమే ఉన్నారు.

Bigg Boss 5: హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కి అన్యాయం.. రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ షో ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 12 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అయితే.. కొందరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా యాంకర్ రవి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ షో పక్కా స్క్రిప్ట్, అగ్రిమెంట్స్ ప్రకారం మాత్రమే జరిగే షోగా దాదాపుగా ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. అయితే.. ఇంట్లో ఉన్న వారిలో ఫైనల్ ట్రోఫీ దక్కేది ఎవరి అన్న ఉత్కంఠ మాత్రం ప్రేక్షకులలో కనిపిస్తూనే ఉంది.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

కాగా.. గత వారం ఎలిమినేషన్ అయిన రవి బయటకి వచ్చాక పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో రవి మాట్లాడిన మాటలతో పాటు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. తాను ఇంటి నుండి బయటకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ చూస్తే కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర విషయంలో బిగ్ బాస్ షో నిర్వహాకులు టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్ లో సరైన స్పేస్ లో చూపించడం లేదని రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Bigg Boss 5 : నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావు.. షణ్ను కోసం రవి త్యాగం?

హౌస్ లో మొదటి రోజు నుంచి ఇప్పుడు వరకు తనకి ఇచ్చిన పని తప్పకుండా చేసే మొదటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శ్రీరామ చంద్ర మాత్రమేనని.. అలాంటిది అతనికి స్పేస్ ఇవ్వకుండా చూపిస్తున్నట్టు నాకు అనిపించిందని అన్నాడు. రవి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సహజంగా ఇంట్లో 24 గంటల సమయాన్ని ఒక గంటకి కుదించి ప్రేక్షకులకు చూపిస్తారు. అయితే.. అందులో శ్రీరామ చంద్రకి స్పేస్ లేకుండా చూపిస్తున్నారని రవి ఆరోపించాడు.