John Abraham : బాలీవుడ్ స్టార్ కపుల్ కి కరోనా పాజిటివ్
హీరో జాన్ అబ్రహాంతోపాటు అతడి భార్యకు కరోనా సోకింది. ''మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వెంటనే నేను, నా భార్య......
John Abraham : గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. బాలీవుడ్ ని అయితే కరోనా భయపెట్టేస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వరుస పెట్టి బాలీవుడ్ స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లు కరోనా బారిన పడ్డారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. నటి నటులంతా కరోనా పరీక్షలు చేయించుకోగా మరిన్ని కేసులు బయట పడుతున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో, ఆయన భార్య కరోనా బారిన పడ్డారు.
PC Reddy : ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డి కన్నుమూత
హీరో జాన్ అబ్రహాంతోపాటు అతడి భార్యకు కరోనా సోకింది. ”మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వెంటనే నేను, నా భార్య ప్రియా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దీంతో మేమిద్దరం హోంక్వారంటైన్ అయ్యాం. మేము ఎవరి కాంటాక్ట్లోకి వెళ్లడం లేదు. మేమిద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. అయినా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. దయచేసి అందరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుని ఆరోగ్యంగా ఉండండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జాన్ అబ్రహం. దీంతో అభిమానులు, నెటిజన్లు వీరు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.