DJ Tillu: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్‌కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’..

DJ Tillu: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!

Dj Tillu

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్‌కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’.. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నటిస్తున్న సిద్ధు, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండడం విశేషం. ఇటీవల రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ చూస్తే ఈ సినిమా పక్కా యూత్ ఎంటర్‌టైనర్ అని అర్థమైంది.

Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?

విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ కథ రాయడం విశేషం కాగా మాటలు కూడా ఆయనే అందించారు. న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమాగా డీజే టిల్లు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించగా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

Sarkaru Vaari Paata: ముహూర్తం పెట్టేసిన మహేశ్.. వాలంటైన్స్ డే రోజున ఫస్ట్ సింగిల్

ఈ నెలలోనే విడుదల కానుండడంతో సినిమా యూనిట్ ప్రచారం కార్యాక్రమాలను హోరెత్తిస్తుంది. హీరో హీరోయిన్లు సిద్దు, నేహా ఇప్పటికే టీవీ షోలలో సందడి చేస్తుండగా తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. నీ కనులను చూశానే అంటూ సాగిన ఈ పాటను సిద్దు పాడడం విశేషం కాగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. రవికాంత్ పేరేఫు రాసిన ఈ పాట పక్కా లవ్ సాంగ్.