Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం.. కొనసాగుతున్న చంద్రగ్రహణం, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 2025లోనే

దేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.

Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం.. కొనసాగుతున్న చంద్రగ్రహణం, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 2025లోనే

Lunar Eclipse 2022 : దేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది. హైదరాబాద్ లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. సాయంత్రం 5గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం ఏర్పడనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విజయవాడలో 5గంటల 32 నిమిషాలకు, వైజాగ్ లో 5గంటల 20 నిమిషాలకు, తిరుమలలో 5గంటల 41 నిమిషాలకు చంద్రగ్రహణం కనిపించనుంది. ఈ ఏడాది ఇదే చిట్టచివరి చంద్రగ్రహణం. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్ కతాలో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్తాయిలో వీక్షించవచ్చు.

Lunar Eclipse 2022 : నేడే అరుదైన బ్లడ్ మూన్.. ఆకాశంలో అద్భుతాన్ని తప్పకుండా చూడాల్సిందే అంటున్న శాస్త్రవేత్తలు

చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని ఎటువంటి పరికరాలు అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం అనుకూలిస్తే పూర్తి స్థాయిలో ఎరుపు వర్ణంలోని చంద్రుడిని చూడొచ్చని చెబుతున్నారు. అనుమానాలు, అపోహలు, భయాలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టి చంద్రగ్రహణాన్ని ఖగోళ పరంగానే చూడాలంటున్నారు సైంటిస్టులు.

Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?

భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించనున్నాడు. భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ వర్ణంలో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. చంద్రగ్రహణం భారత్ దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది.

చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7గంటల 30 నిమిషాల వరకు ఆయల తలుపులు మూసి ఉంచుతారు. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, ప్రదోషపు కాల పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం సర్వ దర్శనం టోకెన్లు, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది

మంగళవారం చంద్ర గ్రహణం ముగిసిందంటే మళ్లీ కనిపించేది 2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.