Mohan Babu: వాళ్లు నాశనమైపోతారు.. మోహన్ బాబు శాపనార్థాలు

"సన్‌ ఆఫ్‌ ఇండియా" సినిమా ప్రమోషన్‌లో భాగంగా మోహన్ బాబు ఓ ప్రముఖ ఛానెల్‌కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

Mohan Babu: వాళ్లు నాశనమైపోతారు.. మోహన్ బాబు శాపనార్థాలు

Mohan Babu

Mohan Babu: “సన్‌ ఆఫ్‌ ఇండియా” సినిమా ప్రమోషన్‌లో భాగంగా మోహన్ బాబు ఓ ప్రముఖ ఛానెల్‌కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో మోహన్ బాబుపై తన కుటుంబంపై వచ్చే ట్రోలింగ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏనుగులు మార్గంలో వెళ్తుంటే, కుక్కలు మొరుగుతున్నాయని.. ట్రోలింగ్ చేసేవారు సర్వనాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలే త‌ప్ప ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌దని అన్నారు.

ట్రోలింగ్ నేను చూడను కానీ, ట్రోల్స్‌ చేయించేవాళ్లు, చేసేవాళ్లు ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడుతారని అన్నారు. ట్రోలింగ్స్‌ను చూసినప్పుడు చాలా బాధ వేస్తుందని, ట్రోల్స్ చేసేవారికి కూడా కుటుంబం ఉంటుంది కదా? అని ప్రశ్నించారు.

ఎదుటివారిని ట్రోల్ చేసి, తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టి పొందే ఆనందం మంచిది కాదని హితవు పలికారు.