హైదరాబాద్‌లో వింత శిశువు.. చేప ఆకారంలో జననం

హైదరాబాద్‌లో వింత శిశువు.. చేప ఆకారంలో జననం

New born baby:హైదరాబాద్ నగరంలో ఓ మహిళ జలకన్య ఆకారంలో వింత శిశువును జన్మించింది. సంగారెడ్డికి చెందిన తహసిన్ సుల్తానా (20) ఈ నెల 5న ప్రసవరం కోసం హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు.

ఆ మహిళకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కాళ్లు అతుక్కుని జలకన్య రూపంలో బిడ్డ పుట్టింది. ప్రసవం చేసిన వైద్యులు వింత శిశువు విషయాన్ని ఆసుపత్రికి సూపరిండెంట్ నాగమణికి వెల్లడించారు. ఆమెతోపాటు ఆసుపత్రిలో పనిచేసే వైద్యులంతా వచ్చి ఆ వింత శిశువును పరిశీలించారు.

అయితే శిశువు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై వైద్యులు స్పందించారు. ఇటువంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.