Evaru Meelo Koteeswarulu: ఎమోషనల్గా ఎన్టీఆర్ కొత్త ప్రోమో..
బిగ్బాస్ సీజన్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి `ఎవరు మీలో కోటీశ్వరులు` షోతో ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ హోస్ట్గా వస్తోన్న ఈ షో వచ్చే నెల ఆఖరి వారంలో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోండగా.. ఆడిషన్స్ త్వరలో స్టార్ట్ కానున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ప్రోమో విడుదల చేసింది నిర్మాణ సంస్థ.
లేటెస్ట్గా విడుదలైన ప్రోమో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. `ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం` అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్లు ఫస్ట్ ప్రోమోలో ఆకట్టుకోగా.. ఇప్పుడు లేటెస్ట్ ప్రోమోలో ఎమోషనల్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. కొంతమంది విద్యార్ధులను తీసుకుని ఓ టీచర్ గార్డెన్లో తిరుగుతూ ఉండగా.. అక్కడ మామిడికాయ శాస్త్రియ నామం ఏంటి? అని అడుగుతారు. వాళ్లకు తెలీదు.. అప్పుడు అక్కడే పనిచేసే అమ్మాయి శాస్త్రీయనామం చెబుతుంది. వెంటనే మందారం గురించి కూడా చెబుతుంది. దీంతో ‘ఏంటమ్మా ఇన్ని తెలిసి ఇక్కడ పని చేస్తున్నావ్’ అని ఆ టీచర్ అమ్మాయిని అడుగుతాడు. జీతం కోసం సార్ అని బదులిస్తుంది ఆ అమ్మాయి.
అప్పుడు వెంటనే ఎన్టీఆర్.. జీవితాన్ని మార్చేద్దాం రా అమ్మా.. అంటూ.. ఎంట్రీ ఇస్తాడు. ‘జీవితాన్ని మారుద్దాం రా అమ్మా. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మీసం తిప్పుతూ డైలాగ్ చెబుతాడు. తద్వారా సామాన్యులకు అండగా నిలిచే షో ఇది అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.