Poonam Kaur : డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

పూనమ్ కౌర్ ఏం చెబుతుంది... ఎప్పుడు చెబుతుంది.. ఎవరి పేర్లు బయట పెడుతుందనేదానిపై  సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. 

Poonam Kaur : డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

Poonam Kaur

Poonam Kaur Tweet : టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ‘డ్రగ్స్ కేసు -ఈడీ ఇంటరాగేషన్’ ఇష్యూపై హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం కొన్నాళ్లుగా.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పొలిటికల్ గానూ.. ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  చేస్తున్న దర్యాప్తు… ఇష్యూను మరింత హీటెక్కిస్తోంది.  డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన  సమాచారంతో… కూపీ లాగుతున్నారు ఈడీ అధికారులు.

Rakul : డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్

ఇప్పటికే ఆగస్ట్ 31.. 2021 నాడు పూరీ జగన్నాథ్ ను… సెప్టెంబర్ 2న ఛార్మిని… సెప్టెంబర్ 3న రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన… నిధుల మళ్లింపు… ఇలాంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. డైరెక్టర్లు, హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీల… సైడ్ బిజినెస్ లకు డబ్బు ఎలా వచ్చిందనేదానిపైనా ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. సినీ సెలబ్రిటీల ఇంటరాగేషన్ తో… రాష్ట్రమంతటా ఈ కేసు దర్యాప్తుపై ఆసక్తి పెరిగిపోయింది.

Charmi: ముగిసిన ఛార్మి విచారణ.. ఇంతకంటే ఎక్కువ అడక్కండి!

లేటెస్ట్ గా… డ్రగ్ వివాదంపై నటి పూనమ్ కౌర్ స్పందన హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ ఒక సెలబ్రిటీ ఇష్యూ మాత్రమే కాదన్నారు పూనమ్ కౌర్.  డ్రగ్స్  అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశమన్నారు. ఇది రాజకీయ పరంగా అజెండాను రూపొందించాల్సిన ఇష్యూ అని చెప్పారు. డ్రగ్స్ అనేది.. స్ట్రాంగ్ ప్యారలల్ ఎకానమీ ఇష్యూ అన్నారు.  ఈ అంశంలో తన సొంత అనుభవాలతో.. త్వరలోనే పబ్లిక్ గా మాట్లాడతానని చెప్పారు పూనమ్ కౌర్.

పూనమ్ కౌర్ ఏం చెబుతుంది… ఎప్పుడు చెబుతుంది.. ఎవరి పేర్లు బయట పెడుతుందనేదానిపై  సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.