Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

Radhe Shyam

Radhe Shyam: ‘బాహుబలి’ తో ‘పాన్ ఇండియా స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ.. శనివారం డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Global Prabhas Day : హ్యాపీ బర్త్‌డే డార్లింగ్

రెబల్ స్టార్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

రాధే శ్యామ్’ టీజర్‌కు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. సినిమా ఎంత లావిష్‌గా ఉండబోతుందనేది టీజర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌‌లో చక్కర్లు కొడుతోంది. 30 నిమిషాల పాటు సాగే షిప్ ఎపిసోడ్ ఒకటి సినిమాలో మేజర్ హైలెట్ కానుందట.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించారట మేకర్స్. 30 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే ‘రాధే శ్యామ్’ షిప్ ఎపిసోడ్ ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేస్తుందని అంటున్నారు. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.