Radhakrishna : ‘బాహుబలి’ కంటే ముందే ‘రాధేశ్యామ్’ మొదలైంది
రాధాకృష్ణ మాట్లాడుతూ.. ''నా దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ సినిమా తర్వాత ‘రాధేశ్యామ్’ అనుకున్నాను. ‘బాహుబలి’ చిత్రం కంటే ముందే ‘రాధేశ్యామ్’ కథని మొదలుపెట్టాను. ‘బాహుబలి’ విడుదల......
Radheshyam : ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరెక్కిన సినిమా ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘రాధేశ్యామ్’ సినిమాని మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. తాజాగా మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ‘రాధేశ్యామ్’ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
రాధాకృష్ణ మాట్లాడుతూ.. ”నా దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ సినిమా తర్వాత ‘రాధేశ్యామ్’ అనుకున్నాను. ‘బాహుబలి’ చిత్రం కంటే ముందే ‘రాధేశ్యామ్’ కథని మొదలుపెట్టాను. ‘బాహుబలి’ విడుదల తర్వాత కూడా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ‘బాహుబలి’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ‘రాధేశ్యామ్’ని కూడా పెద్ద సినిమాగానే ప్లాన్ చేసుకున్నాను. ‘సాహో’ టైమ్లోనే ‘రాధేశ్యామ్’ కూడా కొంత షూటింగ్ జరిగింది. కానీ ఆ తర్వాత కోవిడ్ వల్ల కొంత ఆలస్యం అయింది.” అని తెలిపారు.
Prabhas : ‘రాధేశ్యామ్’ కోసం రాజమౌళి.. శివ రాజ్కుమార్.. పృథ్వీరాజ్
”నేను ఈ కథని మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్ను తీసుకొని దాని ఆధారంగా చేద్దామనుకున్నాను. కానీ ప్రభాస్ సూచన మేరకు యూరప్ బ్యాక్డ్రాప్గా రాశాను. ఇటలీ, ఆస్ట్రేలియా, జార్జియాలో షూటింగ్ చేశాం. కోవిడ్ వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. లాక్డౌన్ వల్ల యూరప్ షెడ్యూల్ను మధ్యలోనే ఆపేసి వచ్చేశాం. క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్లో సెట్స్ వేసి చేశాం” అని సినిమా గురించి తెలిపారు.