PM Modi : రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు..కొత్త పేరు ఇదే

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందిస్తునే విషయం తెలిసిందే. అయితే..ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

PM Modi : రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు..కొత్త పేరు ఇదే

Modi Tweet

Rajiv Gandhi Khel Ratna : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందిస్తునే విషయం తెలిసిందే. అయితే..ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రాజీవ్ ఖేల్ రత్న పేరును ‘మేజర్ ధ్యాన్‌‌చంద్ ఖేల్‌‌రత్న’ గా పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు.

పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆయన తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు..వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ధ్యాన్ చంద్..ఈయన హాకీ లెజెండ్. ఈయన జయంతి సందర్భంగా…ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా మార్చివేసిన సంగతి తెలిసిందే. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ..క్రీడా అత్యున్నత పురస్కారం కూడా ధ్యాన్ చంద్ పేరిట ఇవ్వాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.