Ranbir kapoor : తెలుగు సినిమా చేయడానికి రెడీ అంటున్న బాలీవుడ్ స్టార్..

ప్రస్తుతం కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, వాణీ కపూర్‌ జంటగా సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్రలో ‘షంషేరా’ సినిమా రాబోతుంది. ఈ సినిమాని.............

Ranbir kapoor : తెలుగు సినిమా చేయడానికి రెడీ అంటున్న బాలీవుడ్ స్టార్..

Ranbir Kapoor

Ranbir kapoor :  ఇటీవల తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ చేస్తూ ఇక్కడ సినిమాల్లో భాగమవుతూ, ఇక్కడ భారీగా తమ సినిమాలని ప్రమోషన్స్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని బాగా ఫోకస్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న తన బ్రహ్మాస్త్ర సినిమాకి ఇప్పట్నుంచే టాలీవుడ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలని తన ప్రమోషన్స్ కి వాడుకుంటున్నాడు రణబీర్.

Krithi Shetty: మాచర్ల నియోజకవర్గంలో కృతి ఎంట్రీ అదిరింది!

ప్రస్తుతం కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, వాణీ కపూర్‌ జంటగా సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్రలో ‘షంషేరా’ సినిమా రాబోతుంది. ఈ సినిమాని యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా ఈ నెల 22న హిందీతో పాటు తెలుగు భాషలో కూడా విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ని బాలీవుడ్ లో, టాలీవుడ్ లో గ్రాండ్ గానే చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల తెలుగులో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. ”కరణ్‌ మల్హోత్రా ‘షంషేరా’ స్క్రిప్ట్‌ చెప్పగానే బాగా నచ్చింది. ఈ సినిమాలో బల్లి, షంషేరా అనే రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయటం నా అదృష్టం. దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను బాగా ప్రేమిస్తారు. నేను కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కచ్చితంగా త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాను” అని తెలిపారు.