Sadha : మేజర్ సినిమా చూసి ఏడ్చేసిన సదా.. ఆ సమయంలో ముంబైలోనే ఉన్నాను..
సినిమా చూసి వచ్చాక సదా మీడియాతో మాట్లాడుతూ.. ''ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను ముంబైలోనే ఉన్నాను, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు...........
Sadha : ‘జయం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన భామ సదా. ఆ తర్వాత, తెలుగు, తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా, పలు టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులకి టచ్ లోనే ఉంది. తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా అయ్యాక మీడియాతో మాట్లాడింది.
ముంబయి ఉగ్రదాడిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్గా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాని చుసిన వారంతా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మేజర్ సినిమా చూసిన సదా కూడా ఎమోషనల్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో అయితే విలపించింది.
Kamal Haasan : విక్రమ్ సక్సెస్ మీట్.. సినిమాకి పనిచేసిన వారందరికీ స్పెషల్ పార్టీ..
ఇక సినిమా చూసి వచ్చాక సదా మీడియాతో మాట్లాడుతూ.. ”ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను ముంబైలోనే ఉన్నాను, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సంఘటనలని ఇలా తెర మీద చూస్తుంటే ఆ బాధ బయటకి వచ్చింది. అన్ని విభాగాలు బాగా కష్టపడి సినిమా చేశాయి. ఫస్ట్ హాఫ్ లోనే ఏడ్చేసాను. ఈ సినిమా చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా నన్ను ఏడిపించింది. అడివి శేష్ అద్భుతంగా చేశారు. ఇలాంటి కథలు అందరికి తెలియాలి, శశికిరణ్ బాగా తెరకెక్కించారు ఈ సినిమాని” అని తెలిపింది.