Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ నెలకొంది.

Sarkaru Vaari Paata: సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్న మహేష్..?

ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్ గ్లింప్స్, సాంగ్స్, రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై నెలకొన్నా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకుంది. సర్కారు వారి పాట చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని సెన్సార్ వారు కితాబిచ్చినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా రన్‌టైమ్’ను కూడా చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Sarkaru Vaari Paata: మహేష్ దూకుడు.. యూట్యూబ్ లో ఎస్వీపీ ట్రైలర్ రికార్డులు!

‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఒక సాధారణ కమర్షియల్ సినిమాకు ఇది కాస్త లెంగ్తీ రన్‌టైమ్ అనే చెప్పాలి. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో, పక్కా మాస్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే మాత్రం.. ఈ రన్‌టైమ్‌ను ఎవరూ పట్టించుకోరు అనేది నిజం. ఇక అన్నీ పనులు ముగించుకున్న సర్కారు వారి పాట చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మే 7న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టికెట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మహేష్ బాబు మాస్ స్వాగ్‌తో అలరించబోతున్న సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.