Naga Vamsi: వారంటే మాకెంతో గౌరవం.. ‘భీమ్లానాయక్ నిర్మాత క్షమాపణలు’

సినిమా సక్సెస్ అనేది నిర్మాతపై ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Naga Vamsi: వారంటే మాకెంతో గౌరవం.. ‘భీమ్లానాయక్ నిర్మాత క్షమాపణలు’

Naga Vamsi

Naga Vamsi: సినిమా సక్సెస్ అనేది నిర్మాతపై ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, అప్పుడప్పుడూ కాస్త శృతిమించిన మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అటువంటి స్వరమే ఇటీవల భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ వినిపించారు. డీజే టిల్లు సినిమా సక్సెస్ మీట్‌లో ప్రేక్షకులను ఏకవచనంతో ‘వాడు’ ‘వీడు’ అంటూ మాట్లాడారు.

డీజే టిల్లు సక్సెస్ మాయలో మాట్లాడేసిన నాగ వంశీ లేటెస్ట్‌గా.. “ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.” ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు.

‘ప్రేక్షకులను ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించడం వల్లే. అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా నోట్ విడుదల చేశాడు.