Students Suicides: తమిళనాడులో మరో విద్యార్థి ఆత్మహత్య.. 2 వారాల వ్యవధిలో ఐదుగురి బలవన్మరణం
రెండు వారాల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఐదుకి చేరింది. ఆ రాష్ట్రంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇవాళ 12వ తరగతి విద్యార్థి తన ఇంట్లో విగతజీవిగా కనపడ్డాడు. అతడి ఇంట్లో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తనకు చదువులో రెండు సబ్జెక్టులు అర్థం కావట్లేదని ఆ విద్యార్థి ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.
Students Suicides: తమిళనాడులో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు వారాల్లో ఆ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఐదుకి చేరింది. ఆ రాష్ట్రంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇవాళ ఓ 12వ తరగతి విద్యార్థి తన ఇంట్లో విగతజీవిగా కనపడ్డాడు. అతడి ఇంట్లో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తనకు చదువులో రెండు సబ్జెక్టులు అర్థం కావట్లేదని ఆ విద్యార్థి ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.
ఇంతకుముందు తమిళనాడులో వరుసగా నలుగురు పాఠశాల విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ముగ్గురు 12వ తరగతి విద్యార్థినులు కాగా, ఒకరు 11వ తరగతి విద్యార్థిని. ఈ నెల 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ళ విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత సోమవారం తిరువళ్ళూరులోని పాఠశాల హాస్టల్లో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
మంగళవారం కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ ఉదయం శివకాశి సమీపంలోని అయ్యంపెట్టి గ్రామానికి చెందిన విద్యార్థి 11వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలో ఇప్పుడు శివగంగ జిల్లాలో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
Nuclear Weapons: కృత్రిమ మేధను అణ్వాయుధాలతో పోల్చిన గూగుల్ మాజీ సీఈవో