వ్యక్తిని సజీవ దహనం చేసిన దుండగులు

వ్యక్తిని సజీవ దహనం చేసిన దుండగులు

Kamareddy 2

person is burned Alive :  తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకంది. గుర్తుతెలియని ఓ వ్యక్తిని కొందరు దుండగులు సజీవదహనం చేశారు. గాంధీనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కనే గల రేకుల షెడ్డులో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది చూసిన స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం అన్ని వివరాలతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణాకి పాల్పడింది ఎవరు?  ఎందుకు చేశారు? పాతక్షక్షలేమన్నా ఉన్నాయా? లేదా ఆస్తి గొడవలా? లేక మరేదైనా కారణాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.