Ajay Kumar Puvvada : మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణం అదేనా?
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్..
Ajay Kumar Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ తో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా @tarak9999 గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది. @Koratala_Fans pic.twitter.com/k5bCPmkhqF
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021
మెగాస్టార్ చిరంజీవిని కూడా పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా, సడెన్ గా తెలంగాణ మంత్రి పువ్వాడ సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలను కలవడం ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. పువ్వాడ నయన్ ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవికి నయన్ అభిమాని అయి ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నయన్ మంత్రి కేటీఆర్ ని కూడా కలిశారు.
నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది. @Koratala_fans pic.twitter.com/udJhDfg5zO
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021
నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/GfkdLcBNbt
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021