Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
Telangana Corona Terror News : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 6వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు, గురువారం 494 కేసులు, శుక్రవారం 493 కేసులు, శనివారం 496 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 434గా ఉంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23వేల 979 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 434 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 343 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 కేసులు, సంగారెడ్డిలో 9 కేసులు, ఖమ్మంలో 7 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 285 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Corona Terror News)
Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 99వేల 055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 91వేల 182 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (3,613) 3వేల 762కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 28వేల 808 కరోనా టెస్టులు చేయగా.. 496 కేసులు వచ్చాయి.
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.(Telangana Corona Terror News)
అటు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా 15వేలకుపైగానే నమోదువుతున్న కొత్త కేసులు తాజాగా భారీగా తగ్గి 11 వేలకు దిగివచ్చాయి. మరోవైపు యాక్టివ్ కేసులు 92 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4లక్షల 53వేల 940 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 11వేల 739 కేసులు వెలుగు చూశాయి. కొత్త కేసుల్లో కేరళ (4,098), మహారాష్ట్ర (1,728), తమిళనాడు (1,382) నుంచే సగానికిపైగా ఉన్నాయి.
ఒక్కరోజు వ్యవధిలో మరో 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5లక్షల 24వేల 999కు చేరింది. గడిచిన 24గంటల్లో మరో 10వేల 917 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్ను జయించిన వారి సంఖ్య 4.27 కోట్లు (98.58%) దాటింది. ఇక కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ లక్ష మార్క్ దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 92వేల 576 (0.21%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 12,72,739 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 197 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/l8W00FfqHI— IPRDepartment (@IPRTelangana) June 26, 2022