#NTR30: కొరటాల కథ కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు!

తారక్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు.

#NTR30: కొరటాల కథ కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు!

#ntr30

#NTR30: తారక్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో ముందుగా మొదలయ్యే కొరటాల శివ సినిమా కోసం తారక్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

కాగా, ఇప్పుడు ఈ సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ సిద్ధమవుతుండగా ఇందు కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ఫైనల్ వెర్షన్ తాలూకు కొన్ని సీన్స్ పై చర్చలు, మార్పులు జరుగుతున్నాయట. ఇందు కోసం రచయితలు శ్రీధర్ సీపాన, వేమా రెడ్డిలతో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ కూడా తోడయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనుండగా మరింత పగడ్బంధీగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

SSMB 28: త్రివిక్రమ్ కొత్త కాంబినేషన్.. మహేష్‌తో అందాల రాక్షసి!

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనుండగా మరోవైపు ఈ సినిమా కోసం కొరటాల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీలతో పాటు పూజ హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో లేక కొత్త భామలు ఎవరైనా లైన్లోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.