Rohit Sharma: రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ చూశారా..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. వైస్ కెప్టెన్ కి మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు మార్లు కథనాలు వచ్చాయి. వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని....

Rohit Sharma: రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ చూశారా..

Rohit Sharma (1)

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకి మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు మార్లు కథనాలు వచ్చాయి. వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని వెల్లబరుస్తూ.. రూమర్లను ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో తుడిచేశాడు కోహ్లీ. ఇంగ్లాండ్‌కు.. టీమిండియాకు ఓవల్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు మూడో రోజు సమయంలో ఈ ఘటన జరిగింది.

స్టేడియంలో రోహిత్ శర్మతో పూజారా ఉన్నారు. మొయిన్ అలీ వేసిన 8.5ఓవర్ బంతికి రోహిత్ సిక్సు బాదేశాడు. అప్పటి వరకూ 94పరుగులుగా ఉన్న హిట్ మాన్ స్కోరు సెంచరీకి చేరింది. తొలి విదేశీ సెంచరీ నమోదు చేశాడని కామెంటరీలో చెప్తుండగానే కోహ్లీ లేచి చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

నవ్వుతూ గాల్లోకి పంచులు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు రోహిత్ భార్య రితికా రియాక్షన్ కూడా సోషల్ మీడియాను బాగా అట్రాక్ట్ చేసింది. విదేశీ గడ్డపై తొలి సెంచరీ చేసిన రోహిత్ కు ఓవల్ స్టేడియం చక్కని అనుభవాన్ని ఇచ్చింది.

ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 14ఫోర్లు, ఒక సిక్సుతో కలిపి 127పరుగులు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్లు నష్టపోయిన టీమిండియా 270పరుగులు చేసి 171పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట ముగిసే సమయానికి క్రీజులో విరాట్ కోహ్లీ (22), రవీంద్ర జడేజా (9)ఉన్నారు.