High Blood Sugar : రక్తంలో అధిక చక్కెర లెవెల్స్ శరీరంలోని ఏయే భాగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే?

అధిక బ్లడ్ షుగర్ రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. అందుకని డయాబెటిక్ వల్ల స్ట్రోక్, గుండె జబ్బులతో పాటు కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఇతర పరిస్థితులకు లోను కావాల్సి వస్తుంది.

High Blood Sugar : రక్తంలో అధిక చక్కెర లెవెల్స్ శరీరంలోని ఏయే భాగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే?

Which parts of the body are affected by high blood sugar levels?

High Blood Sugar : మధుమేహం ఈ సమస్య నివారణకు చికిత్స లేదు. పెరగకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హై బ్లడ్‌ షుగర్‌ కారణంగా మనలో అనేక రకాల ప్రభావాలు కనిపిస్తాయి. తరచుగా మూత్రవిసర్జన కావడం, దాహం పెరగడం, అలసట, అస్పష్టమైన కంటి చూపు, అనుకోకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలతోపాటు అంతర్గతంగా రక్తనాళాలు చిట్లిపోవడం, అవయవాలకు రక్తం సరఫరాలో అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం. ఎందుకంటే మధుమేహం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుంది. దాని పర్యవసానాలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఉంటాయి.

మధుమేహం శరీర అవయవాలపై ప్రభావం ;

మూత్రపిండాలు ; మూత్రపిండాలు శరీరంలోని విషపదార్ధాలు, వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో సాయపడుతాయి. కిడ్నీల్లో ఉండే చిన్న రక్త నాళాలకు రక్తంలో అధిక చక్కెర హాని కలిగించవచ్చు. ఫలితంగా డయాబెటిక్ కిడ్నీ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. మూత్రంలో ప్రోటీన్, మూత్ర విసర్జన అవసరం పెరగడం, రక్తపోటు నియంత్రణ మరింత దిగజారడం, పాదాలు, చీలమండలు, చేతులు, కళ్లలో వాపు, వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కళ్లు ; రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కంటి రెటీనాలోని రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. ఇది అస్పష్టమైన దృష్టి, కంటిశుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సంబంధ సమస్యలకు దారితీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే దృష్టి నష్టం కలిగిస్తుంది. చివరకు అంధత్వానికి దారితీస్తుంది.

గుండె, రక్తనాళాలు ; అధిక బ్లడ్ షుగర్ రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. అందుకని డయాబెటిక్ వల్ల స్ట్రోక్, గుండె జబ్బులతో పాటు కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఇతర పరిస్థితులకు లోను కావాల్సి వస్తుంది.

చిగుళ్లు ; రక్తంలో అధిక చక్కెర చిగుళ్లకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు మందంగా తయారవడం వల్ల సంభవిస్తుంది. దీంతో కండరాలు కూడా బలహీనపడతాయి. ఇంకా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు సాధారణంగా చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. చిగుళ్లలో రక్తస్రావం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పాదాలు ; మధుమేహం పాదాలపై కూడా ప్రభావం చూపుతుంది. నరాలు దెబ్బతినడం అనేది పాదం ఎలాంటి అనుభూతిని పొందకుండా చేస్తుంది. పాదాలలో పేలవమైన రక్త ప్రసరణ సమస్య కూడా వస్తుంది. పుండ్లు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన సందర్భాల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే కాలక్రమేణా పాదాలను తొలగించాల్సి వస్తుంది.

నరాలు ; రక్తంలో అధిక చక్కెరలు డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే నరాలను దెబ్బతీస్తుంది. తిమ్మిరి లేదా నొప్పి లేదా ఉష్ణోగ్రతను అనుభవించే సామర్థ్యం తగ్గిపోవడం, మంట, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే, తీవ్రమైన పాదాల పూతలు, అంటువ్యాధుల వంటి వ్యాధులకు దారితీయవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చక్కెర పానీయాలు, అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, వైట్ రైస్, రొట్టెలు, పాస్తా, రుచిగల పెరుగు, తియ్యటి తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి తినడం మానుకోవాలి. శరీరానికి పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు అందివ్వాలి.