Ponniyin Selvan: “పొన్నియన్ సెల్వన్” హీరోల కన్నా ఐశ్వర్యరాయ్ రెమ్యూనిరేషన్ ఎక్కువట!

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్" భారీ అంచనాల మధ్య ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్నా ఈ పిరాడికల్ మూవీ కోసం ఈ తారలు ఎంత రెమ్యూనిరేషన్...

Ponniyin Selvan: “పొన్నియన్ సెల్వన్” హీరోల కన్నా ఐశ్వర్యరాయ్ రెమ్యూనిరేషన్ ఎక్కువట!

Aishwarya Rai Remuneration for Ponniyin Selvan

Ponniyin Selvan: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియన్ సెల్వన్” భారీ అంచనాల మధ్య ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చోళుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మణిరత్నం చాలా కష్ట పడ్డాడని చిత్ర యూనిట్ చెబుతుంది.

Ponniyin Selvan: మణిరత్నం సినిమాకు టికెట్ రేటు ఫిక్స్.. వర్కవుట్ అయ్యేనా..?

భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్నా ఈ పిరాడికల్ మూవీ కోసం ఈ తారలు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అంటూ నెట్టింట ప్రశ్నలు వినిపిస్తుండగా.. ఐశ్వర్యరాయ్ రెమ్యూనిరేషన్ గురించి విని ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రంలో ప్రధాన హీరోగా నటిస్తున్న జయం రవి రూ.8 కోట్లు తీసుకుంటుంటే, ఐశ్వర్యరాయ్ రూ.10 కోట్లు తీసుకోవడం నెటిజెన్లకు షాక్ ని కలగజేస్తుంది. మిగిలిన తారాగణం విక్రమ్ రూ.15 కోట్లు, కార్తీ రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు తీసుకుంటున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.