ఒకే హోటల్లో కంగనా – సంజయ్ దత్‌లు, అందంతో మెరిసిపోతున్నాడంటూ కాంప్లిమెంట్‌లు

ఒకే హోటల్లో కంగనా – సంజయ్ దత్‌లు, అందంతో మెరిసిపోతున్నాడంటూ కాంప్లిమెంట్‌లు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌట్ పర్సనల్ లైఫ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తరచూ వార్తల్లో ఉంటూనే ఉంటున్నారు. తన తర్వాతి సినిమా తలైవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోటల్లో ఉంటున్న ఆమె అదే హోటల్లో ఉంటున్న సంజయ్ దత్‌ను కలిశారట. ఆమెకు తెలిసిన వెంటనే వెళ్లి అతని హెల్త్ గురించి కనుక్కొన్నారట.

ఈ మేరకు కంగనా.. మున్నా భాయ్ హీరో సంజయ్ ఫొటోను పోస్టు చేస్తూ ఇంకా మరింత అందంగానూ.. ఆరోగ్యంగానూ కనిపిస్తున్నారంటూ ట్వీట్ చేసింది.



‘హైదరాబాద్ లోని అదే హోటల్లో ఉంటున్నారని తెలిసి కలవడానికి వెళ్లాను. ఆయన హెల్త్ ఎలా ఉందో కనుక్కుందామని వెళ్లి ఆశ్చర్యపోయా. గతంలో కంటే మరింత అందంగా కనిపిస్తున్నారు. అతనికి మంచి ఆరోగ్యంతో పాటు, చక్కటి జీవితం ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ట్వీట్ లో ఫొటోను జత చేసి రాసుకొచ్చారు.

ఆగష్టు నెలారంభంలో సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలుపెట్టిన సంజయ్.. జబ్బును గెలిచి బయటపడ్డారు. అప్పుడే ఆ విషయాన్ని బయటపెట్టారు సంజయ్. తనతో పాటు కుటుంబమంతా కష్టకాలన్ని ఎదుర్కొందని మీ ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలే తనను బయటపడేలా చేశాయని చెప్పారు.

కోకిలాబెన్ హాస్పిటల్ లో పనిచేసే డా.సేవంతి, నర్సులు, మెడికల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్. కొద్ది వారాలుగా నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి నన్ను కాపాడారని ఆయన పోస్టులో పేర్కొన్నారు.