Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!

మనోజ్ తన రీ ఎంట్రీ వెండితెర మీద కాకుండా బుల్లితెర పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది.

Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!

Manchu Manoj re entry is in small screen instead of big screen

Manchu Manoj : మంచు మనోజ్ సినిమాల్లో కనబడి చాలా రోజులు అవుతుంది. 2017 ఒక్కడు మిగిలాడు (Okkadu Migiladu) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. 2018 లో ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన మనోజ్.. యాక్టింగ్ లైఫ్ ని కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు. ఈక్రమంలోనే వాట్ ది ఫిష్ (What The Fish), భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు.

Ram Charan : ప్రభాస్ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..

ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ కూడా ఏం ఇవ్వడం లేదు. అయితే తాజాగా మనోజ్ కి రీ ఎంట్రీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మనోజ్ తన రీ ఎంట్రీ వెండితెర మీద కాకుండా బుల్లితెర పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక టీవీ షో చేయబోతుంది. ఆ షోలో మంచు మనోజ్ హోస్ట్ చేయబోతున్నాడట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమి రాలేదు. కాగా ఈ షోకి ఇందుకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో కూడా హోస్ట్ పేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.

Jawan : ‘జవాన్’ మూవీని మహేష్ బాబుతో కలిసి చూస్తా అంటున్న షారుఖ్ ఖాన్..

మరి మనోజ్ తన రీ ఎంట్రీని ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. కాగా మనోజ్ ఈ ఏడాది ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. మంచు లక్ష్మి ఈ పెళ్లిని దగ్గర ఉండి జరిపించింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో జంటగా కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు.