Mohan Babu : ఆ గవర్నమెంట్‌కి పోలీస్‌లు తొత్తులుగా ఉంటున్నారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

తమిళ హీరో విశాల్ ‘లాఠీ’ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ తో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మోహన్ బాబు మాట్లాడుతూ..

Mohan Babu : ఆ గవర్నమెంట్‌కి పోలీస్‌లు తొత్తులుగా ఉంటున్నారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Mohan Babu hot comments on police

Mohan Babu : తమిళ హీరో విశాల్ ‘లాఠీ’ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ తో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశాల్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో తన ప్రతి సినిమాని తమిళంతో పాటు ఇక్కడ కూడా విడుదల చేస్తుంటాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

Mohan Babu : హీరో విశాల్‌కి పొగరు ఎక్కువ.. మోహన్ బాబు కామెంట్స్!

ఇక ఈ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. “గత 8 ఏళ్లగా నేను బయట ఏ ఈవెంట్ కి వెళ్లని నేను, తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలి అంటూ పిలివడంతో ఇక్కడికి వచ్చా. విశాల్ నాన్న గారితో నేను ‘ఎం ధర్మరాజు ఎంఏ’ అనే సినిమా చేశాను. కాగా లాఠీ సినిమా ఒక కానిస్టేబుల్ కథని చెప్పారు. సమాజంలో ఏది జరిగిన ముందుగా పోలీస్ వారికే తెలుస్తుంది.

సమాజంలో జరిగే తప్పులను కళ్లారా చూసి కూడా, అది తప్పు అని చెప్పలేని స్థితిలో పోలీసులు ఉన్నారు. ఒకవేళ అది తప్పు అని చెబితే వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. దీంతో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు వరుకు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్‌కి తొత్తులుగా ఉంటున్నారు. నాకు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది కానీ ఇదే నిజం” అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.