Nagarjuna : కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను.. త్వరలో ఓటీటీలోకి కూడా వస్తాను..

ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తర్వాత తన ప్లాన్స్ ఏంటో తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ.. ''కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో............

Nagarjuna : కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను.. త్వరలో ఓటీటీలోకి కూడా వస్తాను..

Nagarjuna gives break to movies

Nagarjuna :  నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న రిలీజ్ కానుంది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తర్వాత తన ప్లాన్స్ ఏంటో తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ.. ”కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. కొన్ని నెలలుగా వరుసగా బిజీగా ఉన్నాను. అందుకే ది ఘోస్ట్ సినిమా తర్వాత ఒక ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. ది ఘోస్ట్ తర్వాత ఇప్పట్లో నా సినిమాలేవీ రావు. ప్రస్తుతం నా సినిమాలేవీ సెట్స్ మీద లేవు.”

Krishnam Raju : కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల స్థలం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

”కొన్ని రోజుల తర్వాత కొత్త కథలు వింటాను. ఓటీటీలో కూడా నటించాలి అని అనుకుంటున్నాను. కథలు విన్నాక అది ఓటీటీకి సరిపోతుందా లేక థియేటర్‌లో రిలీజ్‌ చేయాలా అని ఆలోచిస్తాను. కొన్ని రోజులైతే ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటాను” అని తెలిపారు.