Kamakhya Devi : జననాంగాన్ని పూజించే ఆలయం .. నెలలో మూడుసార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యదేవి పుణ్యక్షేత్రం

ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజించే దేవాలయం. ఎటువంటి విగ్రహారాధన లేని అమ్మవారి ఆలయం. సతీదేవి యోని భాగం పడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య ఆలయం.

Kamakhya Devi : జననాంగాన్ని పూజించే ఆలయం .. నెలలో మూడుసార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యదేవి పుణ్యక్షేత్రం

Kamakhya Devi

Kamakhya Devi : యావత్ సృష్టికి మూలం అమ్మవారు. త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా.. అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం. అంతటి మహిమ గల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనదిగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. మహిమాన్విత శక్తి స్వరూపిణీ అయిన అమ్మవారు నీలాచల్‌ పర్వతశ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది. ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని పూజకు ఓ ప్రత్యేక ఉంది. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధనా జరగదు.  ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

Kamakhya Temple , Guwahati - India Tourism

కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలు పెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది.

Kamakhya Temple Website

అమ్మవారి ఆలయ ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెలతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో మరో సారి తలస్నానం చేస్తే మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు. ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాల భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు.

Kamakhya Temple | AlightIndia

ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాలు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది. ఈ ప్రధాన గోపురం మీద ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే, మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశిస్సుల కోసం వస్తుంటారు. భారత దేశం నుంచే గాక ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.