’అభినంద’నీయం : అభినందన్‌కు జెనీవా ఒప్పందాల అండ

  • Published By: madhu ,Published On : February 28, 2019 / 02:27 AM IST
’అభినంద’నీయం : అభినందన్‌కు జెనీవా ఒప్పందాల అండ

పాక్ సైనికుల నిర్భందంలో ఉన్న అభినందన్ విడుదలవుతాడా ? ఇతనికి హెల్ప్ చేసేది ఎవరు ? దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందరి మదిని తొలుస్తున్న అంశం. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ భారత మిగ్ విమానాన్ని కూల్చేస్తున్న సమయంలో అభినందన్ సురక్షితంగా దాని నుండి బైట పడినా…దురదృష్టవశాత్తు నియంత్రణ రేఖకు అవతల పడ్డారు. బందీగా ఆయన్ను పట్టుకున్నారు. యుద్ధ సైనికులు పట్టుబడితే ‘జెనీవా ఒప్పందాలు’ తెరమీదకు వస్తాయి. ఇవే అత్యంత కీలకంగా మారుతాయి. అసలీ జెనీవా ఒప్పందం ఏంటీ ? యుద్ధ సమయంలో పట్టుబడిన సైనికులు యుద్ధ ఖైదీలు అని పిలుస్తుంటారు. వీరిని ఎలా చూడాలి ? ఎలాంటి రక్షణ కల్పించాలని తదితర హక్కుల గురించి ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది. 

జాతి, మత, లింగ ప్రాంత వివక్షలకు తావు ఉండదు. సైనికులు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో సాయం అందించాల్సి ఉంటుంది. హింసించడం, దాడులు చేయడం చేయకూడదు. న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి ఎలాంటి శిక్షలు విధించవద్దు. వారు గాయపడి, గాయపడకపోయినా హెల్త్ కండీషన్ తెలుసుకోవడం కోసం వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. జెనీవా రెండో ఒప్పందం నౌకాదళానికి, ఇతర నేవీ దళాలకు వర్తిస్తుంది.
యుద్ధంలో సైనికులు కాకుండా సామాన్య పౌరులు పట్టుబడితే ఎలా ? దానిపై కూడా ఒప్పందంలో ఉంది. సైనికుల మాదిరిగానే వీరికి రక్షణలూ కల్పించాలి. వారి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఒప్పందంలో పేర్కొంది. 
సముద్రాల్లో పట్టబడితే వారికి ఓడల్లోనే వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. వారిని కూడా క్షేమంగా చూడాలి. యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన వ్యక్తి నుండి కేవలం పేరు, వారి ర్యాంకు, నంబర్ మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా సమాచారం రాబట్టేందుకు వీలులేదు. హింసించడం, శారీరకంగా, మానసికంగా హింసలకు గురి చేయవద్దని స్పష్టంగా ఒప్పందంలో పొందుపరిచింది.