Video: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

స్పృహ తప్పి పడిపోవడంపై నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Video: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పృహ తప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో ఇవాళ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను అక్కడి బీజేపీ నేతలు కొందరు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు వైద్య సిబ్బంది వెంటనే చికిత్స అందించారు.

కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వేదికపైకి మళ్లీ వచ్చిన నితిన్ గడ్కరీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను స్పృహ తప్పి పడిపోవడంపై నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్రలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తాను స్వల్పంగా అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు.

ఇప్పుడు తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. బీజేపీ నిర్వహిస్తున్న మరో సమావేశానికి హాజరయ్యేందుకు వరుద్‌కు బయలుదేరుతున్నానని తెలిపారు. ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలని పేర్కొన్నారు.

కాగా, నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజక వర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరిగాయి. ఆ స్థానంలో 54.30 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ఆయన తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.

Also Read: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యం ఇదే: పోతిన మహేశ్