Goregaon-Mulund link road: ముంబై ప్రజలకు ట్రాఫిక్ నుంచి ఊరట.. ₹6,322 కోట్లతో రెండు భారీ టన్నెల్స్

4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మాణానికి 6,322 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు బీఎంసీ ప్రతిపాదించింది.

Goregaon-Mulund link road: ముంబై ప్రజలకు ట్రాఫిక్ నుంచి ఊరట.. ₹6,322 కోట్లతో రెండు భారీ టన్నెల్స్

Mumbai to get Rs 6322 crore twin tunnels for east-west connectivity

Goregaon-Mulund link road: ముంబై ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని రోడ్లు నిర్మించి, ఎన్ని వంతెనలు వేసినా మళ్లీ మళ్లీ ట్రాఫిక్ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు ముంబై, పశ్చిమ ముంబై మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ బాధల్ని కూడా తప్పించేందుకు ఒక రహదారి నిర్మించాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంకల్పించింది. ఇందులో భాగంగా గోరేగావ్‭లోని వెస్టర్న్ ఎక్స్‭ప్రెస్ హైవే నుంచి ముల్లుండ్‭లోని ఈస్టర్న్ ఎక్స్‭ప్రెస్ హైవే వరకు 12 కిలోమీటర్ల మేర లింకు రోడ్డు నిర్మిస్తున్నారు.

ఇందులో భాగంగా 4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మాణానికి 6,322 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు బీఎంసీ ప్రతిపాదించింది. 2023 మేలో మొదలు కానున్న ఈ పనులు 2026 అందుబాటులోకి వచ్చేలా పనులు పూర్తి చేస్తామని బీఎంసీ పేర్కొంది.

మొత్తం మూడు దశల్లో ఈ లింకు రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్, టన్నెల్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఈ లింకు రోడ్డులో ఉన్నాయి. ఈ లింకు రోడ్డు నిర్మాణానికి పూర్తి అంచనా వ్యయం 8,000 కోట్ల రూపాయలు అవుతుందని బీఎంసీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇది గతంలో 4,700 కోట్ల రూపాయలు గానే ప్రతిపాదించినప్పటికీ.. గడుస్తున్న కాలానికి అనుగుణంగా అంచనా వ్యయం పెరిగిందట.

Pak PM Sharif: పాక్ డేంజరెస్ కంట్రీ అన్న బైడెన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి